చేతబడి చేస్తున్నారన్న నెపంతో..


శంషాబాద్‌(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోకి కొత్వాల్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని గ్రామస్తులు చితకబాదారు.



అబ్రహం, ఆశిర్వాదం, మోసిన్‌, లలిత, జంగయ్య అనే వారు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులంతా కలిసి.. వీరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఐదుగురినీ పోలీసులకు అప్పగించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top