రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి ఐదవమైల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న షేక్ షరీఫ్(35) విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.