రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జె.పి చెరువు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం అంకాలమ్మపల్లెకు చెందిన కొమ్మునూరి సింహరాయుడు(24) ఆటోలో వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడిక క్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.