విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నూజెండ్ల మండలం తంగిరాలలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఉన్న మోటారు ఆన్ చేసేందుకు వెళ్లిన శ్రీను(35) అనే వ్యక్తికి కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. షాక్ తగిలిన భర్తను పట్టుకున్న రామాంజమ్మ, కుమారుడు లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.