మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎంపీపీ ద్యావత్ సుజాత
లక్ష్మణచాంద : మండలంలోని మహిళా సంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుబడి ఉంటుందని మండల అధ్యకు‡్ష్యరాలు ద్యావత్ సుజాత పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐకేపీ కార్యాలయాన్ని ఆమె సోమవారం ప్రారంభించి అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మహిళ సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆమె తెలిపారు.
మహిళల కోసం డ్వాక్రా వారికి స్త్రీనిధి ద్వారా ఋణ సౌకర్యం, వడ్డీలేని ఋణాలు ఇవ్వడం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని ఆమె తెలిపారు. అందులో భాగంగానే డ్వాక్రా మహిళల కోసం మండల కేంద్రంలో ఐకేపీ నూతన కార్యాలయం నిర్మించిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో శకుంతల, గ్రామ సర్పంచ్ బిట్లింగ్ నారాయణ ,ఎంపీటీసీలు గంగయ్య, ప్రభాకర్, ఐకేపి ఏపీఎం నారాయణ, ఐకేపీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.