రైలు కింద పడి వ్యక్తి మృతి


మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తూ డెల్టా రైలు కింద పడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అబ్బులు(40)గా గుర్తించారు. మిర్యాలగూడలోని బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top