పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య..


జైలు నుంచి భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు.. కన్నబిడ్డలను చంపి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో వివాహం జరిగింది.


కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది. భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపం చెందిన మాధవి.. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలకు ఉరేసి..తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5)ప్రాణాలతో బయట పడగా.. కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం బాను ను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top