12 మంది వడ్డీ వ్యాపారులపై కేసు


అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న 12 మందిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కేసులు పెట్టారు. స్థానికులైన బాధితులు కొందరు బుధవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపించిన సీఐ పాండురంగారెడ్డి 12మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top