మిర్యాలగూడలో వివాహిత దారుణ హత్య


 మిర్యాలగూడ మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద కొంక నర్మద(29) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాలు.. మిర్యాలగూడ మండలం కలల్‌వాడ కాలనీకి చెందిన కొంక రాము, నందిపాడు గ్రామానికి చెందిన నర్మదను 8 సంవత్సరాల క్రితం లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప. నర్మద టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలం సజావుగానే వీరి కాపురం సాగింది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు మొదలయ్యాయి. ఒక సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారు. గతంలో కూడా ఓ సారి నర్మదపై హత్యాయత్నం చేశాడు. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి తిరిగి వస్తోన్న నర్మదను భర్త కొంక రాము సుత్తితో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top