అరటి తోటలో వ్యక్తి దారుణ హత్య
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అల్లిపురంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఒంటినిండా గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే సీఐ రవికుమార్, ఎస్సై శ్రీను సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకుక్కునూరు మండలం సీదర గ్రామానికి చెందిన ప్రేమ్(33)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.