రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


- 50 గొర్రెలు మృత్యువాత


రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మీదుగా వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొనటంతో ఓ వ్యక్తి తో పాటు.. 50 గొర్రెలక ప్రాణాలు కోల్పోయాయి.  తూర్పుగోదావరి జిల్లా దెందులూరు వద్ద జాతీయరహదారిపై గురువారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కొవ్వలికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ జీవాలను పెదపాడు వైపు మేతకోసం తోలుకువెళ్తున్నారు.


 


దెందులూరు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గొర్రెలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా 12 తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల కళేబరాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top