సౌదీలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
సదాశివనగర్ మండలం అడ్లూరుఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తోకల నర్సింగరావు(40) అనే వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతిచెందాడు. రెండు రోజుల క్రితమే నర్సింగ రావు మృతిచెందినట్లు అక్కడి వారు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం సౌదీ వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నర్సింగరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.