శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి డి. నెపోలియన్ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.