రేపటి నుంచి తెలంగాణ పీజీఈసెట్
హైదరాబాద్: టీఎస్ పీజీఈసెట్-2016 ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రం, కో కన్వీనర్ డాక్టర్ రమేశ్బాబు శనివారం తెలిపారు. పీజీఈసెట్ నిర్వాహక కమిటీ సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. సోమవారం నుంచి జూన్ 3 వరకు జరగనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మొత్తం 44,069 మంది అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆన్లైన్లో కాకుండ రాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. హాల్టికెట్ల డౌన్లోడ్కు www.tspgecet.org వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.