బంగారు తెలంగాణ నిర్మిద్దాం

బంగారు తెలంగాణ నిర్మిద్దాం


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప లువురు వక్తలు మాట్లాడుతూ బం గారు తెలంగాణను నిర్మిద్దామని పి లుపునిచ్చారు. ఆయా కార్యక్రమా ల్లో అధికారులు, ప్రజాప్రతినిధు లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



రఘునాథపాలెం: మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ శాంత జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరునాయక్, వైస్‌ ఎంపీపీ యరగర్ల పద్మ, మందడపు నరసింహారావు, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు, ఏఓ భాస్కర్‌రావు, ఏఈ ఆదిత్యరాజు, ఐకేపీ ఎపీఎం శారద, కార్యాలయ సూపరింటెండెంట్‌ జానీ, ఉపాధి ఏపీఓ ఆమ్మాజాన్, కుర్రా భాస్కరరావు, లక్ష్మణ్‌నాయక్, పిన్ని కోటేశ్వరరావు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ తిరుమలాచారి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ గోపి జెండా ఎగుర వేశారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంలు జెండాలను ఎగురవేశారు.



పండ్లు, రొట్టెల పంపిణీ

రఘునాథపాలెం సమీపంలోని మదర్‌థెరిస్సా మానసిక వికలాంగుల కేంద్రంలో  తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని వికలాంగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాతా రఘురాం, గ్రామ కార్యదర్శి పవన్, జి.రామారావు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top