గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్

గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్ - Sakshi


హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక విజయం కొత్త చరిత్రకు నాంది పలికిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్తో పాటు పలువురు మంత్రులు బుధవారం ఉదయం కేసీఆర్‌ను కలిశారు. పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు.



తెలంగాణ ప్రజలు వరంగల్ ఘనవిజయంతో టీఆర్ఎస్ పార్టీని ఎంతో గౌరవించారని కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో జిల్లాకు తగిన ప్రాధాన్యం ఉంటుందని వరంగల్ నాయకులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయంతో గర్వం, అహంకారం పెంచుకోవద్దని కేసీఆర్ సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కార్యకర్తలు ప్రజలకు రక్షణ కవచంలా నిలవాలని పిలుపునిచ్చారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top