విద్యుదాఘాతంతో ఉపాధ్యాయురాలు మృతి
బద్వేలు అర్బన్:
స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(జీవశాస్త్రం)గా పనిచేస్తున్న మణ్యం ప్రమీల(55) సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈమె పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల ఎస్బీవీఆర్ డిగ్రీ కశాళాల సమీపంలో ఓ మేడపైన అద్దెకు ఉంటున్నారు. ఈమె ర్త పెద్దిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఏడేళ్ల క్రితం మృతి చెందారు. ఒక్కగానొక్క కుమార్తె సిరిచందన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దీంతో ప్రమీల ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. రోజులాగే పాఠశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికొచ్చిన తర్వాత బాత్రూమ్లో దుస్తుల ఉతుకుతూ మోటారు వేసేందుకు స్విచ్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమీల మరణవార్త తెలియగానే జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులతోపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.