డబ్బులు పంచారు.. పారిపోయారు
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీడీపీ ప్రలోభాల పర్వం కొనసాగిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతోంది. 10వ వార్డు ములాన్పేట ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అక్కడి చేరుకోవడంతో తెలుగు తమ్ముళ్లు పారిపోయాయి.
మరోవైపు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోనే సమావేశం పెట్టారు. టీడీపీకి ఓటు వేస్తేనే అందరికీ ఇళ్లు ఇస్తామని ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. మున్సిపల్ ఆఫీసులోనే సమావేశం పెట్టినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.