టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు - Sakshi


విశాఖపట్నం: మావోయిస్టులు విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు టీడీపీ నాయకులను కిడ్నాప్ చేశారు. జీకేవీధి మండలం టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గసభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి కమిటీ మండల అధ్యకుడు వందనం బాలయ్యను మావోయిస్టులు అపహరించారు. జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరిని కిడ్నాప్ చేశారు.



బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని మావోలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు ఏఓబీ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top