తెలుగు తమ్ముళ్లు విడిపోయారు


శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. శ్రీకాళహస్తి టీడీపీ వర్గంలో చీలిక కనిపించింది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.



దీనికి ఓ వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. కొందరు ఛైర్మన్ రాధారెడ్డి వ్యతిరేక టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.   

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top