కారెక్కిన నేతలు
► సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన రాథోడ్ రమేశ్, పి.రవీందర్రావు
► వందలాది వాహనాల్లో హైదరాబాద్కు తరలిన టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు
ఖానాపూర్: ఉమ్మడి జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్లకు చెందిన ప్రముఖ నేతలు సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాథోడ్, రవీందర్రావు చేరికలతో ఉమ్మడి జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన వెంట పెద్ద ఎత్తున తరలివెల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ వారికి గులాబి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమరెడ్డి, ఎంపీలు గేడెం నాగేశ్, బాల్క సుమన్, వినోద్, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, నడిపెల్లి దివాకర్రావు, నల్లాల ఓదేలు, ఎంఎల్సీ పురాణం సతీశ్, తదితరులు హాజరయ్యారు. కాగా రాథోడ్ వెంట తెలుగు యువత రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రితీశ్రాథోడ్, ఆదిలాబాద్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు యూనిస్ అక్బాని, కుమురంభీం జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం, ఉమ్మడి జిల్లా గిరిజనేతరుల సంఘం అధ్యక్షుడు నాందేవ్, ఉపాధ్యక్షుడు బుట్టో, 30కి పైగా మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, పీఏసీఎస్ చైర్మెన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లుఉన్నారు.
రాథోడ్ రమేశ్ పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలోని టీడీపీ నాయకులతో పాటు తన అనుచరగణంతో తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రవిందర్రావు వెంట, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్రావు, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు భరత్చౌహాన్, జన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకరయ్య, ఖానాపూర్, జన్నారం కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు కొండాడి గంగా రావు, సుధాకర్నాయక్, జన్నారం మాజీ ఎంపీపీ మోహన్రెడ్డి, ఆయా మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్కు వీరంతా వందలాది వాహనాల్లో తరలివెళ్లారు.