ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా

ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా - Sakshi


తిరుపతి: కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును టీడీపీ ఖరారు చేసింది. ఆదివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. టీడీపీ మరో రాజ్యసభ సీటును మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ కేటాయించింది. 



కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది. మూడో రాజ్యసభ సీటు రేసులో మాజీమంత్రి పుష్పరాజ్‌ పేరు వినిపిస్తోంది. నాల్గో రాజ్యసభ సీటుపై చర్చ కొనసాగుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top