బావిలో పడి ఒకరి మరణం
గంట్యాడ : జీవితంపై విరక్తి చెందిన ఒకరు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మతుడి తండ్రి కాళేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నరవ గ్రామానికి చెందిన బుగత కష్ణప్పడుకు (38) తొమ్మిదేళ్ల కిందట సాలూరుకు చెందిన సూర్యకష్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల కిందట ఇతని భార్య వేరొకరితో వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు వారిని తీసుకువచ్చి భార్యభర్తలను ఒకటి చేశారు. మళ్లీ నాలుగు రోజుల కిందట వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన కష్ణప్పడు మంగళవారం ఉదయం పొలానికి వెళ్తానని చెప్పి బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మతదేహానికి బుధవారం జిల్లా కేంద్రాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
విజయనగరంలో యువకుడు..
సీతం కళాశాల సమీపంలో ఉన్న నేలబావిలో పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి వన్టౌన్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలో గెస్ట్ హౌస్ కాలనీకి చెందిన బొత్స షణ్ముక సాయి (23) విజయనగరంలో గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి కష్ణమూర్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందట బొబ్బిలి వచ్చిన సాయిని తండ్రి తిరిగి విజయనగరం తీసుకువచ్చాడు. సోమవారం ఉదయం సాయి తన అక్కతో ఫోన్లో మాట్లాడాడు. ఇదిలా ఉంటే సీతం కళాశాల ఆవరణలో ఉన్న బావి వద్ద పుస్తకాలు, దుస్తులు ఉండడాన్ని గమనించిన పశువల కాపరి పోలీసులకు విషయం తెలియజేశాడు. దీంతో పోలీసులు బుధవారం ఉదయం నూతిలోని నీటిని తోడించి మతదేహాన్ని వెలికితీశారు. సాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు. వన్టౌన్ ఎస్సై జీఏవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.