ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
-
- స్థానికుల సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మరో విద్యార్థి -
ఎన్డీఆర్ఎఫ్ గాలింపులో బయటపడ్డ మృతదేహాలు -
- రెండు కుటుంబాలకు తీరని విషాదం
మంగళగిరి : గుంటూరు ఛానల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు నీటమునిగి మృతిచెందారు. మరో విద్యార్థిని స్థానికులు కాపాడగలిగారు. ఆడుతూ పాడుతూ ఉదయం వరకు తమ కళ్ల ముందు తిరిగిన కుమారులు ఆకస్మికంగా విగతజీవులుగా మారడం పట్టణంలోని వారు నివాసముంటున్న గండాలయపేట, పెద్ద కోనేరు సెంటర్లలో విషాదాన్ని నింపింది. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. రాత్రికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. వారు గాలింపు చేపట్టగా ఇరువురు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాదంగా మారింది. పట్టణ సీఐ బ్రహ్మయ్య విద్యార్థుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.