రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
విజయనగరం: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కాపుసోంపురం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు విద్యార్థులను వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఓ పాఠశాల విద్యార్థి మృతిచెందగా, మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బాధిత విద్యార్థులు రవితేజ స్కూలు విద్యార్థులుగా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థి మహేశ్ అని సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.