పడిపోతున్న శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయం నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 808.90 అడుగులకు చేరుకుంది. పీక్లోడ్ అవర్స్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తుండడం వల్ల నీటిమట్టం క్రమేణా తగ్గుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.227 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.374 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 5,649 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. జలాశయంలో 252 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు గేజింగ్ సిÐబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాÔ¶శయంలో 33.6709 టీఎంసీల నీరు నిల్వ ఉంది.