అంతమొందించే కుట్రలో భాగమే ఆరోపణలు


మాజీ మంత్రి శ్రీధర్‌బాబు



 కాటారం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మరి కొందరు నాయకులు కలసి తనను, తన కుటుంబంతోపాటు కొందరు కాంగ్రెస్ నాయకులను అంతమొందించేందుకు కుట్రపన్నుతున్నట్లు  పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.



శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ..  నయీమ్‌తో సంబంధాలు అంటగట్టడం తమను నిర్మూలించే కుట్రలో భాగమే అన్నారు.  సమస్యలను తప్పుదోవ పట్టించడం కోసం తనకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top