నేటి నుంచి ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభం
నంద్యాల: దసరా, మొహర్రం పండగలకు సెలవులు రానున్న నేపథ్యంలో నంద్యాల మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లతో పాటు రిజర్వేషన్ సదుపాయం ఉంది. నవంబర్ 17వరకు ఈ ప్రత్యేక రైలు తిరుగుతాయి.
– విజయవాడ–రాయచూర్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.10గంటలకు విజయవాడలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.30గంటలకు నంద్యాలకు, మంత్రాలయానికి 10.40కు, రాయచూర్కు 11.30కి చేరుతుంది. మళ్లీ అక్కడి నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మంత్రాలయానికి 6గంటలకు, రాత్రి 11గంటలకు నంద్యాలకు, మరుసటి రోజు తెల్లవారుజామున 5గంటలకు విజయవాడకు చేరుతుంది.
– మచిలీపట్నం–రాయచూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి శనివారం మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి రాత్రి 10.50గంటలకు నంద్యాలకు, మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు మంత్రాలయం, 6.50 గంటలకు రాయచూర్కు చేరుతుంది. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి 6గంటలకు మంత్రాలయం, రాత్రి 11గంటలకు నంద్యాల, మరుసటి రోజు ఉదయం 7.15గంటలకు మచిలీపట్నానికి చేరుతుంది.