‘మల్లిపూడి’పై ప్రత్యేక తపాలా కవర్
కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత మల్లిపూడి శ్రీరామసంజీవరావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల కానుంది. ఆయన మృతి చెంది ఏడాదయిన సందర్భంగా రూపొందించిన ఈ కవర్ను సెప్టెంబర్ 3న కాకినాడ జేఎన్టీయూ ఆవరణలోని అలూమిని ఆడిటోరియంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరిస్తారు.
ఈ విషయాన్ని శ్రీరామసంజీవరావు కుమారుడు, కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు సోమవారం కాకినాడలో విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆరోజు సాయంత్రం జరిగే కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతారని తెలిపారు.