దొంగతనం కేసులో ఒకరికి ఆరు నెలల జైలు
నిజామాబాద్ : దొంగతనం కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం రెండో అదనపు కోర్టు మేజిస్ట్రేట్ జావీద్పాష తీర్పు వెల్లడించారు. 2015 మే 27న మాక్లూర్ మండలం మాణిక్భండార్లో గల బొప్పి సాయిలుకు చెందిన శ్రీ సాయి వర్క్షాప్ గోదాంలో దొంగ తాళాలు పగులగొట్టి గోదాంలో గల ఆరు టైర్లు, ఏడు బ్యాటరీలను ఎత్తుకుపోయాడు. దీనిపై బాధితుడు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు అనుమానితుడైన ఆర్మూర్రోడ్డు లక్ష్మీప్రియనగర్కు చెందిన బందెల సందీప్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు పంపారు. కేసులో పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరికృష్ణ వాధించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ జావీద్పాష నిందితుడికి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించారు.