ముచ్చటగా మూడోరోజు
ఎస్సై అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలకు వర్షందెబ్బ
ఇప్పుడు నిర్వహించని వారికి జూలై 1న ఈవెంట్లు
నేటి నుంచి ప్రక్రియ యధాతథం
ఖమ్మం క్రైం: ఈ నెల 27వ తేదీన ఖమ్మంలోని పొలీస్ పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) దేహ దారుఢ్య పరీక్షలకు తొలి రోజు నుంచి వర్షం అడ్డంకిగా మారుతోంది. మొదటి రోజు ముసురు కురుస్తున్నా..100 మీటర్లు, 800మీటర్లు, హైజంప్, లాంగ్జంప్, షార్ట్పుట్ పరీక్షలు నిర్వహించారు. మంగళవారం, బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేని వానతో రెండు రోజులూ ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. బుధవారం ఎస్పీ షాన్వాజ్ఖాసీం ఆదేశాల మేరకు పురుష అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం వర్షంలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పరేడ్ గ్రౌండ్కు బస్సులో తరలించారు.
అర్హత పత్రాలు అందించేవరకు వానలో తడవకుండా మూడు బస్సుల్లో విశ్రాంతి పొందేలా ఏర్పాట్లు చేశారు. మూడో రోజు మొత్తం 953మంది అభ్యర్థులు వచ్చారు. వీరికి జూలై 1వ తేదీన ఈవెంట్లు నిర్వహిస్తామని ఎస్పీ షాన్వాజ్ ఖాసీం ప్రకటించారు. మంగళవారం వాయిదాపడిన వారికి జూలై 2వ తేదీన ఈవెంట్లు ఉంటాయి. గురువారం (నేటి) నుంచి అభ్యర్థులకు యధావిథిగా ఎంపికల ప్రక్రియ కొనసాగుతుంది. వర్షంలో మహిళా అభ్యర్థులు ఇబ్బంది పడకుండా పోలీసు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు మాణిక్రాజ్, సంజీవ్, సాయిశ్రీ, సీఐలు మొగిలి, వెంకటనర్సయ్య, సారంగపాణి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.