పేకాట ఆడుతున్న ఏడుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్
మహబూబ్నగర్: పోలీసులు దారి తప్పారు. నిత్యం పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాట ఆడేవారిని అరెస్ట్ చేసే పోలీసులే పేకాట రాయుళ్లుగా అవతారమెత్తారు. ఈ దృశ్యం మహబూబ్నగర్ జిల్లా అయోధ్య నగర్లో ఆదివారం వెలుగుచూసింది.
అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్ల నుంచి 93 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.