రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం

రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం - Sakshi


చేవెళ్ల రూరల్‌: పలు సామాజిక, విద్యాసంబంధమైన సేవా కార్యక్రమాలను చేసినందుకు చేవెళ్లకు చెందిన ఉపాద్యాయుడు పి.రామకృష్ణారావుకు శిఖరం ఆర్ట్‌ అసోసియేషన్‌ పురస్కారాన్ని అందజేసింది. ఈ అవార్డును బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, మల్లాది చంద్రమౌళిల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు గురువారం చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసిన పెద్దలకు, శిఖరం అర్ట్‌ థియేటర్స్‌ అసోసియేషకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పురస్కారం అందించి మరింత బాధ్యతను పెంచినట్లు చెప్పారు. అవార్డు కార్యక్రమంలో శిఖరం అర్ట్‌ థియేటర్స్‌ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాచం సత్యనారాణగుప్త తదితరులు పాల్గొన్నారని రామకృష్ణారావు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top