మల్లీశ్వరి ఆత్మహత్య

మల్లీశ్వరి ఆత్మహత్య - Sakshi


చిత్తూరు : పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారి ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. వివరాలు.. మల్లీశ్వరి (11) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. మల్లీశ్వరి తల్లిదండ్రులు కూలిపనుల కోసం వలస వెళ్లారు.


బాలిక ఇంట్లో ఒక్కతే ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆ క్రమంలో తీవ్రమైన కడుపు నొప్పి లేస్తోందని పక్కింటి వారితో చెప్పింది. దాంతో వారు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మల్లీశ్వరి మృతి చెందింది.


మల్లీశ్వరి మృతిపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మల్లీశ్వరి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సహచర విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top