విద్యాశాఖాధికారుల తనిఖీలు


కొండపి: కొండపి వేసవి శిక్షణ తరగతులు తూచ్ అన్న శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన వార్తకు మండల విద్యాశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్న వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న స్పెషల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు సీఆర్‌పీలతో మాట్లాడారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు రెండు గంటల పాటు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, సైన్స్‌లో పాఠాలు బోధించాలన్నారు. బీసీ గ్రేడు విద్యార్థులను ఏ గ్రేడుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలన్నారు. మండలంలోని మిగతా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను సైతం తనిఖీ చేస్తామని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేసవి శిక్షణ తరగతులు నిర్వహించే పాఠశాలలు తెరకుంటే చర్యలు తప్పవన్నారు.

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top