భూదాన భూములను పరిరక్షించాలి


 జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): భూదాన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని సర్వోదయ మండలి రాష్ట్ర కోకన్వీనర్‌ శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భూదానం ద్వారా వచ్చిన భూములను సమగ్ర సర్వే చేయించాలని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన ఆ భూములు బడా బాబుల చేతుల్లో ఉన్నాయన్నారు. 

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top