వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
పెంచికల్పేట్(సిర్పూర్): వేసవిలో వన్యప్రాణుల సం రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్టు ఆదిలాబాద్ సర్కిల్ ఇన్చార్జి సంజయ్కుమార్ గుప్తా అన్నారు. మండలంలోని బొంబాయిగూ డ సమీపంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాలువ ని ర్మాణంలో పోతున్న భూములను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాగజ్నగర్ డివిజన్ ప్రాంతంలో పెద్దపులులు సంచరిస్తున్నాయని, వాటి ఆవాసానికి హాని జరగకుండా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్దేశించిన అటవీ ప్రాంతం మేరకే పనులు చేపట్టేలా చూడాలని అటవీ సిబ్బందిని ఆదేశించారు.
అగర్గూడ అటవీ ప్రాంతంలో నీటి కుంట పరిశీలన..
గుండెపల్లి సెక్షన్ పరిధిలోని అగర్గూడ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన సెలయేరును పరిశీలించారు. వేసవి కాలంలో నీరు లభించక వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో ఉందని అడవి నుంచి నీటి కోసం వన్యప్రాణులు అరణ్యం నుంచి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో సహజంగా ఏర్పడిన నీటి కుంటలను సంరక్షించాలన్నారు.
అగర్గూడ సమీపంలో పెద్దపులి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అభినందించారు. వన్యప్రాణులను వేటాడే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్వోలు నాగవత్ స్వామి, రాంమోహన్, వేణుగోపాల్, ఎఫ్ఎస్వోలు ప్రభాకర్, శ్రీకాంత్, ఎఫ్బీవో ఉజ్వల్ ప్రసాద్, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.