పాముకాటుకు రైతు బలి
హత్నూర (సంగారెడ్డి): పాము కాటుకు గురైన రైతు చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందిన సంఘటన హత్నూరలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ నెల 21న శుక్రవారం హత్నూర గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ(43) తన పొలంలో గడ్డిని తీసే సమయంలో పాము కాటు వేసింది. దీంతో గమనించిన కుటుంబీలు చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు గాంధీ ఆసుప్రతికి రిఫర్ చేశారు. చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సోమవారం ఎస్ఐ తెలిపారు. మృతుడు లక్ష్మీనారాయణ హత్నూర గ్రామ పంచాయతీ రెండవ వార్డు సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. మృతుడికి భార్య నర్సమ్మతోపాటు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.