సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు

సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు


విజయనగరం: ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. సమత ఎక్స్ ప్రెస్ రైలు(విశాఖ-హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ ) వెళ్లే మార్గంలో పట్టా విరిగినట్లు ముందుగానే గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా మనాపురం వద్ద పట్టా విరిగినట్లు గ్యాంగ్ మెన్ గుర్తించాడు. రైల్వే అధికారులకు విషయం తెలిపాడు. దీంతో సమత ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ఆపివేయడంతో ముప్పు తప్పింది. ఆ మార్గంలో కొంత సమయం రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top