రెండు బైక్లు ఢీ..ఆర్టీసీ డ్రైవర్ మృతి
ముండ్లమూరు: ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద ఎదురెదురుగా వస్తోన్న రెండు బైక్లు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో చెన్నయ్య(55) అనే ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నయ్య విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.