ఆర్టీసీ బస్సు బోల్తా
ఒకరి మృతి.. 12 మందికి గాయాలు
ఫిట్స్తో సీట్లో ఒరిగిన డ్రైవర్
శంకరపట్నం : మండలంలోని తాడికల్ శివారులో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. కరీంనగర్ డిపోకు చెందిన అద్దెబస్సు ఆదివారం రాత్రి శంకరపట్నం మండలం గద్దపాక, వీణవంక మండలం ఘన్ముక్కలకు చెందిన 23 మంది ప్రయాణిలతో బయలు దేరింది. శంకరపట్నం మండలం తాడికల్ శివారులోకి చేరుకోగానే డ్రైవర్కు ఫిట్స్రావడంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో మండలంలోని కన్నాపూర్కు చెందిన నర్సింగోజు చంద్రయ్య(45) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా సంఘటన స్థలానికి కేశవపట్నం ఎస్సై ఎల్.శ్రీను చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో తరలించారు.
ఈ ప్రమాదంలో కండక్టర్ నహీంపాషా(35), శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన దేవునూరి సుశీల(60) దేవునూరి రాజమల్లు(65), ఎం.సరోజన, కనకయ్య, తాడికల్కు చెందిన సలీం(45), ఎండి.హబీబ్(27), కేశవపట్నంకు చెందిన మాటూరి సరోజన(40), ముత్తారం గ్రామానికి చెందిన షాబుద్దీన్, వీణవంక మండలం ఘన్ముక్కులకు చెందిన విజయలక్ష్మిల(45)తోపాటు మరో మగ్గురికి గాయాలయ్యాయి. ఫిట్స్తో సీట్లో ఒరిగిన బస్సుడ్రైవర్ కొంరయ్యను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని హుజూరాబాద్ రూరల్ సీఐ గౌస్బాబా పరిశీలించారు.