విద్యుత్ బకాయిలు రూ.34.14కోట్లు


శ్రీకాకుళం టౌన్ : జిల్లా వ్యాప్తంగా మొండి బకాయిలు పక్కన పెట్టి 2015 జనవరి మొదలు 2016 నవంబరు మధ్య కాలంలో విద్యుత్  బిల్లుల బకాయిలను చెల్లించాలంటూ ఈపీడీసీఎల్ అధికారులు గ్రామ పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో 1100 గ్రామ పంచాయతీల్లో ఈ కాలానికి విద్యుత్ బకాయిలు రూ.34.14కోట్లు కాగా అందులో 40శాతం బకారుులైనా చెల్లించమంటూ నోటీసులు జారీ చేశారు.  నోటీసులు అందుకున్న కొందరు సర్పంచ్‌లు 13, 14 ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇప్పటికే రూ.9.09కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.8.91కోట్ల మేరకు ఇంకా వసూలు కావాల్సి ఉందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీ కార్యాలయానికి లేఖ పంపించారు.

 

  ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయితీల్లో విద్యుత్ బిల్లులు చెల్లించ మంటూ జిల్లా పంచాయితీ అథికారి జి కోటేశ్వరరావు గతంలో పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. అరుుతే చెక్‌పవర్ సర్పంచ్‌ల చేతిలో ఉండడం వల్ల విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వారు సహకరించడం లేదంటూ కార్యదర్శులు జిల్లా అధికార్లకు మొర పెట్టుకున్నారు. దీంతో ఈపీడీసీఎల్ సంస్థ ఇచ్చిన నోటీసులపై జిల్లా పంచాయతీ అధికారులు చేతు లెత్తేశారు. చేసేది లేక విద్యుత్ శాఖ గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించారు. 

 

 కొన్ని  పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించిన విద్యుత్ శాఖ అధికారులను నిర్భందించారు. పాత బకాయిలు చెల్లించబోమంటూ కొందరు సర్పంచ్‌లు చెబుతుండడంతో దశలవారీ చెల్లింపునకు అవకాశం కల్పించారు. అరుుతే ఈ బకాయిలు కూడా గ్రామ పంచాయతీల నుంచి చెల్లించడం లేదని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు దత్తి సత్యనారాయణ తెలిపారు. బిల్లులు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top