సైనిక నిధికి రూ.2 లక్షల విరాళం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు గాయత్రి ఎస్టేట్స్కు చెందిన బి.సరోజిని, బి.పార్వతి సైనిక సంక్షేమ నిధికి రూ.2 లక్షలు చెక్ను అందజేసినట్లు జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.రాచయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారు రాష్ట్రంలోనే అత్యధిక వ్యక్తిగత విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మాజీ సైనికుల కోసం సైనిక సంక్షేమ నిధికి విరాళాలు స్వయంగా ఎస్బీ అకౌంట్లో, లేదా తమ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. ఇలా ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు 9494510499 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
సంబంధిత వార్తలు