రూ.17.4 లక్షలతో నవ్యాంధ్ర లడ్డూ

రూ.17.4 లక్షలతో నవ్యాంధ్ర లడ్డూ


తాపేశ్వరం (మండపేట): తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో మరో భారీ లడ్డూ తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది విశాఖలో ప్రవాస భారతీయుడు పల్లా రమణ నేతృత్వంలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుడి చెంత ఉంచేందుకు 8 వేల కిలోల భారీ లడ్డూను తయారు చేయనున్నట్టు శ్రీ భక్తాంజనేయ స్వీట్స్‌స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) మంగళవారం విలేకరులకు వెల్లడించారు.



ఈ అతిపెద్ద లడ్డూకు ‘నవ్యాంధ్ర లడ్డూ’గా నామకరణం చేశామన్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటలకు లడ్డూ తయారీ ప్రారంభించి 8 గంటల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు సుమారు రూ.17.40 లక్షల వ్యయం కానుందన్నారు. తమ సంస్థ 2011లో 5,570 కిలోల లడ్డూ, 2012లో 6,599, 2013లో 7,132, 2014లో 7,858 కిలోల లడ్డూలు తయారుచేసి వరుసగా నాలుగేళ్లు గిన్నిస్ రికార్డులను నెలకొల్పినట్టు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top