వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్లు


ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఐసీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన డయగ్నస్టిక్ ల్యాబరేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామని అందుకోసం తక్షణం రూ. 16 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.






 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top