రేపు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య రాక
కాకినాడ సిటీ :
తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్ పోర్టికోలో బస చేస్తారు.
అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్లో జువెల్ సిటీ ఫేజ్–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు.