కొల్లేరులో అటవీ సిబ్బందిపై దాడి..


కృష్ణా: కృష్ణాజిల్లాలోని కొల్లేరులో శనివారం అటవీ సిబ్బందిపై దాడి జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుంచి యగనమిల్లి మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది రోడ్డు నిర్మాణానికి అడ్డుకునేందుకు కొల్లేరు వెళ్లింది.



ఈ నేపథ్యంలో అటవీ సిబ్బందిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఆందోళనకు దిగారు. కాగా, ఈ రోడ్డు నిర్మాణానికి  అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మద్దతు ఉన్నట్టు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top