లారీ ఢీకొని వ్యక్తి మృతి


గిద్దలూరు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాదుల్లా(29)అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాదుల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. బాదుల్లా వైఎస్సార్ జిల్లా రామాపురానికి చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top