వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి


అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దమ్మ గుడిలో మొక్కు చెల్లించుకోవడానికి ఆటోలో వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. నలుగురు అక్కడికక్కడే మ​ృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో.. ఓ చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతులు మణుగూరు మండలం బ్రాహ్మణకుంటకు చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌: ఇద్దరి మృతి


సంగెం: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సంగెం మండలం కొలిమెర్ల వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏఎస్‌పేట మండలం హసనాపురం గ్రామానికి చెందిన ప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి బైక్‌పై సంగెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top