రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


లింగాల : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం తపలాపురానికి చెందిన ఏలేటి అంజయ్య (60) తమకున్న గేదెలను మేత కోసం ఇటీవల లింగాల మండలానికి తరలించాడు. దీంతో అతని భార్య ముత్తమ్మ సూరాపూర్‌లో ఉన్న తన చెల్లెలు ఇంటి వద్ద ఉంటూ వాటిని మేపుతుండేది.

 

ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గేదెలను తీసుకెళ్లేందుకుగాను ఆదివారం ఉదయం భర్త ఇక్కడికి వచ్చాడు. రాత్రి సుమారు ఎనిమిది గంటలకు ఇద్దరూ కలిసి తిరిగి వెళుతుండగా మగ్ధూంపూర్‌ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కూటరిస్టు ఢీకొన్నాడు. దీంతో అంజయ్యకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యంలోనే దుర్మరణం చెందాడు. ఈయనకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top